హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ గుడికి నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీశ్రావు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఆరు నెలల్లో గుడి పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకుంటామని తెలిపారు. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్న రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు. చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. రూ. 30 లక్షలతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టని ఈటల రాజేందర్కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తాడు. అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్కు ఓటు వేసి గెలిపించండి. బీజేపీ నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. ధరలు పెంచే బీజేపీ కావాలా పేద ప్రజలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా ఆలోచించాలని మంత్రి హరీశ్రావు సూచించారు.