ముంబై , జూన్ 9: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో బుధవారం స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 52,401.41 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,446.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,204.99 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.20శాతం అంటే104.03 పాయింట్లు ఎగిసి 52,377.26 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,766.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,792.95 గరిష్టాన్ని, 15,723.10 వద్ద కనిష్టాన్నితాకింది. నిఫ్టీ అంటే 0.27శాతం 42.70 పాయింట్లు లాభపడి 15,782.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ 3.74 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.40 శాతం, కోల్ ఇండియా 2.31 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 2.29 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.53 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 1.38 శాతం, మారుతీ సుజుకీ 1.15 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.08 శాతం, బజాజ్ ఆటో 0.81 శాతం, లార్సన్ 0.73 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.