హైదరాబాద్: నగరంలో గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. పీపుల్స్ ప్లాజాలో నేటి నుంచి ఐదు రోజులపాటు జరగనున్న ఈ జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ (టీఈఓ) ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 23 వరకు ఈ జాతీయ ప్రదర్శన జరుగుతున్నది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి దేశంలోని ప్రముఖ సంస్థలు, నర్సరీలు 125 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా వివిధ రకాల పూలు, పండ్లు, టెర్రస్ గార్డెనింగ్ మొక్కలను ప్రదర్శించనున్నారు.