సిద్దిపేట : జిల్లా పర్యటనలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో గడా నిధులు రూ.35 లక్షలతో నిర్మించనున్న లక్షా 20 వేల సామర్థ్యం గల ఓహెచ్ఎస్సార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మునిగడపలో రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించిన
రైతువేదికను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కాగా, మంత్రికి పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ