లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న అటవీ మార్గం గుండా బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటవీ మార్గాల గుండా రాత్రి వేళల్లో ప్రయాణించొద్దని స్థానికులకు అధికారులు సూచించారు.