కోరుట్ల, మే 15: పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక చొరవ చూపారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు శనివారం వసతులను పరిశీలించారు. పట్టణంలో ఆక్సిజన్తో కూడిన పలు పడకల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సంజయ్కుమార్ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు. ఈక్రమంలో కోరుట్లలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమమైనట్లు టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్ తెలిపారు. రెండు రోజుల్లో బెడ్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఐసొలేషన్ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. డాక్టర్ సంజయ్కుమార్ ఐసొలేషన్ కేంద్రానికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, సర్జికల్ సామగ్రి సమకూర్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పట్టణ ప్రణాళికాధికారి శ్రీనివాస్, మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.