భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఐపీఎల్ 2021 సీజన్ను వాయిదా వేశారు.
సీజన్లో మిగిలిన మ్యాచ్లను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
మరికొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ను భారత్లో నిర్వహించకపోవడమే మంచిదని
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ‘గతేడాది యూఏఈలో ఐపీఎల్ అద్భుతంగా జరిగింది. లక్షలాది మంది అభిమానులు లీగ్ను భారత్లోనే నిర్వహించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెగా ఈవెంట్ను ఇక్కడ నిర్వహించడం సురక్షితం కాదని’ కమిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో కమిన్స్ కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.