బొల్లారం, జూలై 8 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 12, 19 వార్డుల్లో ఆమె పర్యటించి హరితహారం భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటి పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్క లు నాటాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు బాలమణి రత్నం, సంధ్యాజైపాల్రెడ్డి, నాయకులు సంతోశ్రెడ్డి, ఆర్పీలు, ప్రజలు పాల్గొన్నారు.
ముబారక్పూర్లో మహిళా శ్రమదానం..
పల్లె ప్రగతిలో భాగంగా ముబారక్పూర్లో సర్పంచ్ మన్నె శ్రీవాణి ఆధ్వర్యంలో మహిళలు శ్రమదానం నిర్వహించారు. గురువారం సదాశివపేట మండలం ముబారక్పూర్లో గ్రామ సమైఖ్య సంఘం సభ్యులు రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 10వ తేదీ వరకు నిర్వహించే పల్లెప్రగతిలో గ్రామస్తులందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రమీల, సమైఖ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ..
హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. కంది మండలం కాశీపూర్లో ఎంపీపీ సరళ, జడ్పీటీసీ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు మొక్కలు అందజేశారు. అదేవిధంగా వడ్డెగూడ తండాలో స్పెషల్ ఆఫీసర్ శశికళ, స్థానిక నాయకుడు మోతీలాల్నాయక్ గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విశ్వప్రసాద్, నాయకులు జావెద్ తదితరులు పాల్గొన్నారు.