హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సోదరుడు, డిక్కీ సౌత్ ఇండియా వైస్ చైర్మన్ రాహుల్ కిరణ్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.