హైదరాబాద్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయంపై సౌతాఫ్రికా శాఖ హర్షం వ్యక్తం చేసింది. పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఈ విజయంతో స్పష్టమైందని సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు పేర్కొన్నారు. ‘కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నది. గడిచిన ఆరేండ్ల అనేక అద్భుత విజయాలు నమోదు చేసింది. కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధే ఇందుకు సాక్షి. పెరిగిన ఆస్తుల విలువ.. మారిన జీవన నాణ్యతే ఇందుకు నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.