హైదరాబాద్ : జూన్ 3వ తేదీ. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పుట్టినరోజు. 49వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి హరీశ్ ట్విట్టర్ ద్వారా మిత్రులు, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. మిత్రులకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3) న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఙప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఙతలు అని ఆయన పేర్కొన్నారు.