పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
66 డివిజన్లలో గెలుపు ఖాయం
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
కాజీపేట, ఏప్రిల్ 26: సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి లేదని, దమ్ముంటే కోచ్ ఫ్యాక్టరీని తెప్పించి మాట్లాడాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజక వర్గంలోని 48, 47, 62 డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థులు షర్తాజ్ బేగం, సంకు నర్సింగ్రావు, సుంచు కృష్ణ గెలుపునకు దర్గా కాజీపేట, బాపూజీనగర్ చౌరస్తా, సోమిడిలో ఆయన ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరు నెలల్లో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసి తీరుతామని, సీఎం కేసీఆర్ రాష్ట్రప్రజలకు రూ. కోట్లు ఖర్చుపెట్టి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ. 3.5లక్షల నగదుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీస్సీల నిరుద్యోగులకు రూ.ఐదు లక్షల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తొలుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్విప్ దాస్యం మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో 66 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, ఇన్చార్జిలు సుందర్రాజు, వెంకన్న, రమేశ్, దానం, కే రాజు, బీ యాదగిరి, బీ ఐలయ్య, టీ సారంగపాణి, పీ శ్రీకాంత్చారి, ప్రేమ్నాథ్, హరినాథ్, నయింజుబేర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
అక్రమంగా తరలిస్తున్న 25 కేజీల వెండి పట్టివేత
గులాబీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు