హైదరాబాద్ : రాష్ట్రంలోని రజక, నాయీ బ్రహ్మణ సంఘాలతో మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాలయంలో సమావేశమయ్యారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి మేలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 200 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. వీలైనంత త్వరగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.