కరీంనగర్ : ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మండలం సిరసపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ కె. శశాంకతో కలిసి మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ రెండు ప్రాంతాల్లో సుమారు 5 వందల ఇండ్లు నిర్మిస్తుండగా, ఇండ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని అధికారులు మంత్రి దృష్టి తీసుకువచ్చారు.
అయితే మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. హుజురాబాద్ లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయని.. త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిర్మిస్తున్నామని తెలిపారు. పంపిణీలో లబ్ధిదారుల ఎంపికలో సైతం పారదర్శకత పాటిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ