న్యూఢిల్లీ: భారత్తో కీలకమైన వన్డే సిరీస్కు ముందు ఇంగ్లాండ్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా భారత్తో త్వరలో జరిగే వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్ తొలి భాగం మ్యాచ్లకు దూరంకానున్నట్లు తెలుస్తోంది. ఆర్చర్ మోచేతికి గాయమైందని, తీవ్రత ఎక్కువగానే ఉందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వెల్లడించాడు. ఆర్చర్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్, తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ తరఫున ఆర్చర్ ప్రధానపాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.
మంగళవారం నుంచి వన్డే సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో ఆర్చర్ అందుబాటులో ఉంటాడా? అని అడిగిన ప్రశ్నకు మోర్గాన్ బదులిస్తూ..’ఇంకా కచ్చితంగా తెలియదు. జోఫ్రా తన చేతిని ఎలా పైకి లేపుతున్నాడో అనేది చూడాలి. గాయం తీవ్రత ఐతే పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. మా మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తుందని’ పేర్కొన్నాడు.