ముంబై: దక్కన్ చార్జర్స్ (డీసీ) కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరట లభించింది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్)కు రూ.4800 కోట్లు కట్టాలంటూ ఆర్బిట్రల్ గతంలో ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ గౌతమ్ పటేల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్.. గతేడాది మద్యవర్తిత్వ ప్యానల్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. 2012లో లీగ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా డీసీపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.