నిమ్స్కు వచ్చేవారిని వెనక్కి పంపొద్దు: ఈటల

హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): నిమ్స్కు వచ్చే ఏ ఒక్క రోగి వెనక్కి వెళ్లకూడదని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై సంతోషంగా ఇంటికి వెళ్లేలా వైద్యులు చికిత్స చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. నిమ్స్లో వైద్యసేవలు మరింత మెరుగపడాలని ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్లో వైద్యారోగ్యశాఖ కార్యర్శి రిజ్వీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణతోపాటు నిమ్స్లోని వివిధ విభాగాల అధిపతులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా మూత్రపిండాలు, గుండె, కాలేయం రుమటాలజీ వైద్యసేవలు మరింత మెరుగుపడాలని సూచించారు. అవయవ మార్పిడి సమర్థంగా చేస్తున్న వైద్యులను అభినందించారు. గుండెరంధ్రాలు, చిన్న వయస్సులో కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ హెమరేజ్ వంటి వాటికి చికిత్స అందించటం ద్వారా 70 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రోగికి, వారి సహాయకులకు వైద్యులు కౌన్సెలర్ల ద్వారా పరిస్థితిని వివరించాలని తెలిపారు.
తాజావార్తలు
- గీతా గోపీనాథ్పై బిగ్ బీ అనుచిత వ్యాఖ్యలు! నెటిజన్ల ట్రోల్స్
- ఇలా చేస్తే మీ వాట్సాప్ భద్రం..!
- తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా పట్లొల్ల మోహన్ రెడ్ది
- 28 నుంచి మణుగూర్-సికింద్రాబాద్ మధ్య రైలు కూత!
- మరోసారి రుజువైన సింప్సన్ జోస్యం!
- 2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
- అందుకే నో చెప్పిన సింగర్ సునీత
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బడుగుల
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
- కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్