యాదాద్రి భువనగిరి : రేపు యాదాద్రికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రానున్నారు. ఈ నేపధ్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు, స్వాగత ఏర్పాట్లను కలెక్టర్లు అనితారామచంద్రన్, పమేలా సత్పతి, ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఈవో గీతారెడ్డి పరిశీలించారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు రావొద్దని అధికారులకు సూచించారు.