హైదరాబాద్ : నమస్తే తెలంగాణ దిన పత్రిక సీఎండీ దామోదర్ రావుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం హైదరాబాద్లోని దామోదర్ రావు నివాసంలో పరామర్శించారు. దామోదర్ రావు తండ్రి నారాయణరావు గత గురువారం పరమపదించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. దామోదర్ రావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Salman Khan: ఆ గేమ్తో నన్ను అవమానిస్తున్నారు.. కేసు పెట్టిన సల్మాన్