వరంగల్ రూరల్ : రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధిదారులకు కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 వేల 305 రేషన్ కార్డులను కొత్తగా పంపిణీ చేస్తున్నామని అయన తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాలోని ఐనవోలు, ఉప్పరపల్లి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులను మంత్రి ఎర్రబెల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మర్నేని రవీందర్ రావుతో కలిసి మంగళవారం లబ్దిదారులకు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా పెన్షన్లు పొందడానికి కనీస వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోని సాంఘికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. అలాగే జనగామ జిల్లా పాలకుర్తి లో ఆహార భద్రత కార్డులను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ