వరంగల్ రూరల్ : రైతు సంక్షేమ నాయకుడు మన సీఎం కేసీఆర్కు తెలంగాణ రైతాంగం అండగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు అన్నారు. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ధాన్యం సేకరణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం మండలానికో ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని సేకరించాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బందుకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని, రైతులు ఆదోళన చెందవద్దని భరోసా కల్పించారు.
సీఎం కేసీఆర్ కృషితో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుని, పుష్కలంగా సాగునీరు అందుతుండటంతో.. గతంతో పోలిస్తే ఈ యాసంగి అధిక దిగుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. నిత్యం రైతుల కోసం ఆలోచించే మహానాయకుడు మన సీఎం కేసీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
గన్తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి