వరంగల్ : సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) సిబ్బందితో కలిసి లింగాల ఘన్పూర్ పోలీసులు ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 473 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 24 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు నగరంలోని బుధవారిపేటకు చెందిన అక్షింతల్ సంధ్య అలియాస్ దివ్య అలియాస్ రాణి, మరో మహిళను అదే ప్రాంతానికి చెందిన బోయ కవితగా గుర్తించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నివసిస్తున్నారు.
వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నూలులో టైలర్లుగా పనిచేసే నిందితులు రద్దీగా ఉండే ప్రదేశాలలో, ఆటోరిక్షాల్లో దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించినట్లు తెలిపారు. బస్సులలో ప్రయాణించి ప్రయాణికుల నగదు, బంగారాన్ని దొంగిలిస్తుంటారన్నారు. బోయ కవిత అనే మహిళ 2005 నుండి ఎనిమిది దొంగతనాలకు పాల్పడగా, సంధ్య 2014 నుండి 2019 వరకు రాష్ట్రవ్యాప్తంగా 16 దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. అరెస్టు వీరు బెయిల్పై విడుదలైనట్లు చెప్పారు. గత సంవత్సరం నుండి మరో 11 దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ పేర్కొన్నారు.