వరంగల్ రూరల్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాయంపేట మండలం మందారిపేట వద్ద హన్మకొండ నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును..ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా