వరంగల్ రూరల్ : అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (92) పార్థివదేహానికి పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణా రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్ సారయ్య, రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఓడీసీఎమ్ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ములుగు జెడ్పి చైర్మన్, జగదీష్, రూరల్ జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, తదితరులు ఉన్నారు.