హనుమకొండ : తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నివాళులు అర్పించారు. ఐలమ్మ జయంతి సందర్భంగా హంటర్ రోడ్ న్యూ శాయంపేట పద్మాక్షిరోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా ఐలమ్మ ఎంతో ధైర్యంగా పోరాడిందని ప్రశంసించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్, హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.