జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి – జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా చండీ యాగానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహా చండీ యాగంలో పాల్గొని పూజలు చేశారు.
అనంతరం గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు, వారి తనయుడు గౌతమ్ రెడ్డి దంపతులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మంత్రి తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి కోరికలు నెరవేరాలని, వారంతా వారివారి పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.