వరంగల్ రూరల్ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పర్వతగిరి మండలం గుంజాలకుంటతండాలో మొక్కలు నాటారు. అనంతరం రూ.4.50 కోట్లతో ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కల్లెడ గ్రామంలో గోదాం నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ