మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ బాలసాని
ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 25: అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం పాటు పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నగరంలోని వీడీఓఎస్ కాలనీ, బ్యాంక్ కాలనీ, పరిసర ప్రాంతాల్లో 55వ డివిజన్ అభ్యర్థి శశికళకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ బాలసాని ఇంట్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో ఖమ్మంలో నీటి కొరత అధికంగా ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు.
52,53డివిజన్లో ప్రచారం
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 25: గడిచిన ఆరేండ్లలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేసిన అభివృద్ధే సర్కార్ పనితీరుకు నిదర్శనమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం 52,53వ డవిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు బుర్రి వెంకటేశ్వరరావు, శ్రీ విద్య విజయాలను కాంక్షిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్లలో ముఖ్య నాయకులతో వారు సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో వుంచుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి వారు గుర్తు చేశారు. అనతి కాలంలోనే ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందంటే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేస్తున్న కృషిని గుర్తు పెట్టుకోవాలన్నారు. నేడు రాష్టంలో ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకపోతుందన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరువ చేస్తూనే మరోవైపు నగరం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మంత్రి పువ్వాడకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వెంకటేశ్వరరావు, పగడాల శ్రీవిద్యను బారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.