జిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి సురేశ్
తొర్రూరు, మార్చి 31 : ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్రాహకాలు అందిస్తున్నాయని జిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి ఈ సురేశ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మండలంలోని కంఠాయపాలెం గ్రామంలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను, ఆయిల్ ఫెడ్ను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో వంద కోట్లతో ఆయిల్ పామ్ పరిశ్రమను ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టిసారించాలన్నారు. జిల్లాలో 3 వేల ఎకరాల్లో సా గును పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మొ క్కల కొనుగోలు నుంచి ఎరువుల వాడకంతో పాటు ప్రతి దశలో ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తున్నాయని, మొదటి నాలుగేండ్లలో కేంద్రం ప్రభుత్వం నుంచి రూ. 2.70లక్షలు అందిస్తుందన్నారు. పొద్దుతిరుగుడు, వేరుశనగ పంట సాగు తగ్గుతుండడంతో పామాయిల్కు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఆ యిల్ పామ్ పంట సాగులో రైతులు ఉద్యాన అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించా రు. ఆయిల్పామ్ పంటలు వేయాలనుకునే రైతులు 6304552235 నంబర్ను సంప్రదించాలని కోరా రు. ఆయిల్ పాం ఏరియా ఆఫీసర్ సురేశ్, ఎంపీపీ చిన్నఅంజయ్య, తదితరులు ఉన్నారు.