హైదరాబాద్: తెలంగాణ చరిత్రను తన కవితల ద్వారా నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా హన్మకొండలోని నక్కలగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కాళోజీ, జయశంకర్ సార్లు వరంగల్ బిడ్డలు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. ఆ ఇద్దరు మహనీయులు పుట్టిన గడ్డ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. కాళోజీ ఆయశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగుతున్నదని తెలిపారు. కాళోజీ అందించిన స్ఫూర్తే తన రాజకీయ ఎదుగుదలకు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎంపీ బండప్రకాశ్, మేయర్ గుండు సుధారణి పాల్గొన్నారు.