తొర్రూరు, మే 15 : కొవిడ్ లక్షణాలతో బాధపడే వారికి పక్కా ప్రణాళికతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని యూపీహెచ్సీలో 30 పడకల ఐసొలేషన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 20 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర పరికరాలను ఉన్నాయని చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు ఆమెరికాలో ఉన్న మిత్రులు అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేట్లర్లను అందజేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు.