న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అయితే పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, ఇవాళ దానికంటే 10 వేలు తక్కువగా రికార్డయ్యాయి. అయితే మరణాల సంఖ్య పెరగడం గమనార్హం. వరుసగా ఐదో రోజు మూడు వైలకుపైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,92,488 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 3689 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఇంత భారీసంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,95,57,457కు చేరాయి. ఇందులో 1,59,92,271 మంది కోలుకోగా, 33,49,644 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,15,542 మంది మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3,07,865 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు 15,68,16,031 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 63,282 నమోదవగా, కర్ణాటకలో 40,990, కేరళలో 35,636 రికార్డయ్యాయి. అదేవిధంగా మహారాష్ట్రలో 802, ఢిల్లీలో 412, ఉత్తరప్రదేశ్లో 303 మంది మృతిచెందారు.
కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి మే 1 వరకు 29,01,42,339 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 18,04,954 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..