మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 9 : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అన్ని రకాల వైద్యసేవలు అందేలా మహబూబ్నగర్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల లో రూ.3 కోట్లతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్ర ల్ రీసెర్చ్ లేబరేటరీని ప్రారంభించారు. అలాగే మెడికల్ కళాశాల ఆవరణలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రూ.400 కోట్లతో మహబూబ్నగర్లో మరో దవాఖాన నిర్మించునున్నట్లు వెల్లడించారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్, డెంటల్, ఫా ర్మా కళాశాలలు వస్తాయన్నారు.
వైద్యు లు, బోధనా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, విద్యార్థులు కూ డా విద్యనభ్యసించిన ప్రాంతాన్ని, కళాశాలను మరవొద్దని కోరారు. మెడికల్ కళాశాల సంపద వనంలో శ్రీ గంధం, ఎ ర్రచందనం, మహాఘని, టేకు మొక్కలు నాటామన్నారు. మొక్కల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవ ర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మె డికల్ కళాశాల డైరెక్టర్ పుట్టాశ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ రాంకిషన్, ఆర్డీవో పద్మ శ్రీ, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శామ్యూల్, వైస్ ప్రిన్సిపాల్ డా.సునందిని, డా.రామాకళ, డాక్టర్ కిరణ్ ప్రకాశ్, కౌన్సిలర్లు కృష్ణ మోహన్, విఠల్రెడ్డి, కిశోర్, టీఆర్ఎస్కేవీ నాయకులు సుదీప్రెడ్డి, గణేశ్, బాలరాజ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి..
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కోడూరు గ్రామంలో ఎదిర-2 ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాన్ని ఆయ న ప్రారంభించారు. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడూరులో పీహెచ్సీని అన్ని హంగులతో ఏర్పాటు చేస్తామన్నారు. రెగ్యులర్గా అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పూర్తి స్థాయిలో ఉండి పనిచేయాలని ఆదేశించారు. ప్రతి శనివారం గైనకాలజిస్టును, పిల్లల వైద్యుడిని ఏర్పా టు చేయాలన్నారు. ఇక్కడ వ్యాధుల నిర్ధారణతోపాటు బస్తీ దవాఖానలా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ మాట్లాడారు. టీఆర్ఎస్ నేత రవీందర్రెడ్డి తన సొంత నిధులు రూ.25 నుంచి పీహెచ్సీకి పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో అ డిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్, డీఎంహెచ్వో కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో శశికాంత్, ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాం కిషన్, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీ పీ సుధాశ్రీ, సర్పంచుల సంఘం మండ ల అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, పీఏసీసీఎస్ డైరెక్టర్ రాజేశ్వర్రెడ్డి, మల్లు దేవేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ నర్సింహులు, మ న్యంకొండ ఆలయ కమిటీ సభ్యుడు చిన్నయ్యగౌడ్, బుచ్చన్నగౌడ్, వార్డు స భ్యులు, నాయకులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లావాసి..
ఈనెల 17 నుంచి ఇండో-నేపాల్లో జరుగనున్న అంతర్జాతీయ కబడ్డీ టోర్నీ కి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థి సుమన్ ఎంపికయ్యా డు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అతడిని మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. అంతర్జాతీయ టోర్నీలో ప్రతి చా టి భారత జట్టు విజయానికి కృషి చేయాలన్నారు. ప్రతిభ గల క్రీడాకారులకు అం డగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి, యాజమాన్యం నాగేందర్, కోట్ల శివకుమార్, కోచ్ జంగయ్య, క్రీడాకారుడి తండ్రి నరసింహ ఉన్నారు.