హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన వంతుగా 105 మంది దివ్యాంగులకు ట్రైస్కూటర్లను అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శనివారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొదటి విడతగా పాలకుర్తి మండల కేంద్రంలో ఐదుగురు, రాయపర్తి మండల కేంద్రంలో ఐదుగురు చొప్పున దివ్యాంగులకు ట్రైస్కూటర్లు పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. కోటి వ్యయంతో వీటిని అందజేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి స్పష్టంచేశారు.