నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని నంది గుండం దుర్గామాత ఆషాఢ బోనాల ఉత్సవాలలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి మహిళలు, మేళా తాళాలు,మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బోనాలను ఎంతో ఘనంగా జరుపుకునేవాళ్లం. కరోనా కారణంగా గత సంవత్సరం బోనాలను నిరాడంబరంగా భౌతిక దూరంలో జరుపుకున్నాం అని అన్నారు.
వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నంది గుండం ఆలయాన్ని రూ. 50 లక్షల నిధులతో నిర్మించామన్నారు. కాళికా మాత ఆలయానికి రూ.50 లక్షలు, గాలి గోపురానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్లో 500 పైగా ఆలయాలను నిర్మించుకున్నామని పేర్కొన్నారు.
అమ్మవారి కృప వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, లక్కడి జగన్మోహన్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, పాకాల రాం చందర్, కొండజి వెంకట్ చారి, దేవేందర్ రెడ్డి, అకోజి కిషన్, దశరథ్, నర్సయ్య రవి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు