Telangana
- Jan 26, 2021 , 11:59:46
VIDEOS
పద్మశ్రీ కనకరాజుకు మంత్రి అల్లోల శుభాకాంక్షలు

హైదరాబాద్ : పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం కనకరాజుకు ఫోన్ చేసి అభినందించారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కనకరాజుకు అరుదైన గౌరవం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు, ఆదివాసీలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. గుస్సాడీ కళారూపంతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా కనకరాజు గొప్ప పేరు తెచ్చారని ప్రశంసించారు. గుస్సాడీ కళ అంతరించి పోకుండా తర్వాతి తరానికి శిక్షణ ఇచ్చి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ‘యూపీఐ’ సేవలకు ట్రూకాలర్ రాంరాం.. సేఫ్టీపైనే ఫోకస్
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
MOST READ
TRENDING