నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానలపై రెమ్డెసివిర్ టాస్క్ఫోర్స్ కమిటీ తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు శుక్రవారం నగరంలోని ప్రతిభ, మెడికవర్ దవాఖానల్లో తనిఖీలు నిర్వహించారు. దవాఖానలో కొవిడ్కు సంబంధించిన రోగుల వివరాలు, వారికి ఇస్తున్న రెమ్డెసివివర్ ఇంజక్షన్లు, ధరలను పరిశీలించారు.
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు యాజమాన్యాలను హెచ్చరించారు. తనిఖీల్లో సీఐ ప్రభాకర్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బాలనరేంద్ర, డ్రగ్ ఇన్స్పెక్టర్ హేమలత, డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు