జగిత్యాల : సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎంపీడీవో ఆఫీస్ వేదికగా 23 మంది లబ్దిదారులకు మంత్రి రూ.06,46,000/- విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత, ఎంపీ వెంకటేష్ నేత, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గొస్కుల జలేంధర్, బుగ్గారం మండల జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ ముస్కు లింగాల రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మన్ గంగాధర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్, సింగిల్ విండో ఛైర్మన్ మాధవరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.