రాజన్న సిరిసిల్ల : జిల్లా పరిధిలోని మిడ్ మానేరు గేట్లను ఎత్తి దిగువకు 6,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గాయత్రి పంప్హౌస్ నుంచి మిడ్ మానేరుకు 6,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. అదే స్థాయిలో మిడ్ మానేరు ఐదు గేట్లు ఎత్తి.. లోయర్ మానేరుకు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. మిడ్ మానేరులో 12.85 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 27.5 టీఎంసీలు. ఇక పార్వతి పంపు హౌస్ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు.