సూక్ష్మ కళాకారుడు దయాకర్ ప్రతిభ
జగిత్యాల టౌన్, జూన్20: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ తన ప్రతిభను చాటుకున్నాడు. యోగా సాధన చేస్తున్న ఓ మహిళ విగ్రహాన్ని కేవలం 0.2 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేయడంతోపాటు ఆ విగ్రహాన్ని గుండుసూది మొనపై నిలిపి అందర్నీ అబ్బురపర్చాడు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 8 గంటల సమయం పట్టినట్టు ఆయన వివరించాడు. గతంలో దయాకర్ ఇలాంటి ఎన్నో కళాకృతులను తయారు అవార్డులు కూడా పొందాడు.