బీఈడీ అడ్మిషన్ల విధానంలో మార్పులు
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు చదువకపోయినా ఆయా మెథడ్స్లో బీఈడీ పూర్తిచేయవచ్చు. అయితే సంబంధిత సబ్జెక్టును ఇంటర్లో మాత్రం కచ్చితంగా చదివి ఉండాలి. ఇందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో -16ను జారీచేసింది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2006లో జారీచేసిన జీవో- 92ను సవరిస్తూ, జీవో-16ను జారీచేసింది. బీఈడీ సీట్ల భర్తీ కోసం మార్గదర్శకాలను విడుదలచేసింది. ఉదాహరణకు బీసీఏ విద్యార్థులు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే ఫిజికల్సైన్స్ మెథడ్లో చేరవచ్చు. బీబీఏ, బీసీఏ, బీబీఎం విద్యార్థులు ఇంటర్లో సోషల్సైన్సెస్ చదివినా బీఈడీ సోషల్స్టడీస్ మెథడ్లో చేరేలా మార్పులుచేసింది. కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలో సీట్లభర్తీలో ఇదే విధానాన్ని అనుసరించాలని జీవోలో పేర్కొన్నది.
మార్పులివే..