వలిగొండ, జూన్ 11: ప్రజల నిరంతర అప్రమత్తతతోనే కరో నా వైరస్ను నియంత్రించవచ్చని ఎంపీపీ నూతి రమేశ్ రాజ్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాల యంలో కరోనా వైరస్ పై పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమా వేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజల అజాగ్రత్తలతో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్తో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఎవరు బయట తిరగొద్దన్నారు. దుకాణల వద్ద భౌతిక దూరం పాటిం చే విధంగా షాపుల యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వాకిటి పద్మా అనంత రెడ్డి, సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, డాక్టర్ కిరణ్కుమార్, వైద్య సిబ్బంది సంతోష్, శ్రీలక్ష్మి వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ
ఆత్మకూరు(ఎం): మండలంలోని మొరిపిరాల గ్రామ పంచా యతీ పరిధిలోని చిన్నగూడెంలో కరోనా బాధిత కుటుంబాల కు టీఆర్ఎస్ నాయకుడు గడ్డం దశరథ గౌడ్ సహకారంతో శుక్రవారం ఇంటింటికీ తిరిగి నిత్యావసర సరుకులు అందజే శారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెల జ్యోతి, టీఆర్ఎస్వీ బెజ్జెరబోయిన మహేశ్, గ్రామ యువజన విభాగం నాయకులు వెం కట్రెడ్డి, నర్సిరెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు శానిటైజర్, మాస్కులు అందజేత
కరోనా వైరస్ నిర్మూలన కోసం నిరంతరం విధులు నిర్వహి స్తున్న ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ సిబ్బందికి శుక్రవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శానిటైజర్, మాస్కులు అందజేశా రు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దొండల అనిల్కుమార్, యూత్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు కిర ణ్, మహేశ్, అనిల్గౌడ్, సుభాశ్రెడ్డి పాల్గొన్నారు.
పోస్టల్ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం
మండలంలోని పారుపల్లిలో విధులు నిర్వహించిన పోస్టల్ ఉద్యోగి స్వామి 20 రోజుల క్రితం కరో నాతో మృతి చెందాడు. దీంతో మన ఊరు మన పారుపల్లి వాట్స ప్ సభ్యుల సహకా రంతో సేకరించిన రూ.41వేలను శుక్రవారం మృతుడి స్వగ్రా మమైన వలిగొండ మండలం నర్సాపురానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పారుపల్లి సర్పంచ్ లగ్గాని రమేష్గౌడ్, బయ్యాని నవీన్ కుమార్, హరీశ్రెడ్డి, అజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌ న్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్సై ఎండీ ఇద్రీస్ అలీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మోత్కూరు-భువనగిరి ప్రధాన రోడ్డుపై సాయంత్రం 5గంటల తరువాత నిబంధనలు పాటించని వాహనాదారులను తనిఖీ చేసి అను మతులు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ
రాజాపేట: మండలంలోని కొన్రెడ్డిచెర్వులో శుక్రవారం టీఆర్ ఎస్ నాయకుడు ఉప్పరి నరేశ్ ఉపాధి కూలీలకు 300 మాస్కు లను పంపిణీ చేశాడు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు చెరుకు కనకయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.