అమరావతి: ఏపీలోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెరిట్ స్కాలర్షిప్లను ప్రకటించారు. నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలైన బీబీఏ, బీకాం, లా, బీఎస్సీ, బీఏ, పీజీ కోర్సులకు జీవీ మెరిట్ స్కాలర్షిప్, రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ అందించనున్నట్టు వీఐటీ వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ జీ విశ్వనాథన్ పేర్కొన్నారు.