న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వైరస్ రెండో దశ వేగంగా వ్యాపిస్తున్నది. రోజు వారీ కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య ఆందోళన రేకెత్తిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,26,789 కొవిడ్ కేసులు, 685 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,28,574కు పెరగ్గా.. మృతుల సంఖ్య 1,66,862కు చేరింది.
కొత్తగా 59,258 మంది డిశ్చార్జి అవగా.. 1,18,51,393 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,10,319కు చేరాయి. మరో వైపు టీకా డ్రైవ్ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,01,98,673 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. మరో వైపు నిన్న ఒకే రోజు 12,37,781 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 25.26కోట్ల కొవిడ్ కేసులు నమోదు చేసినట్లు వివరించింది.