మేళ్లచెర్వు: మూడో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచా మృత అభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివవిష్ణువర్దన్శర్మ, ధనుంజయశర్మ శాస్ర్తోక్తంగా జరిపించారు.
అనంతరం స్వామి వారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహానివేదన, మంగళ నీరాజనం మంత్ర పుష్ప పూజలను వేదమంత్రాలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.