తూప్రాన్ రూరల్, మే 25 : తూప్రాన్లోని సీహెచ్సీ, పీహెచ్సీ దవాఖానల్లో మంగళవారం కోవాగ్జిన్ సెకండ్ డో స్ వ్యాక్సిన్ ప్రారంభమైంది. మొదటి డోస్ వేసుకున్న వారు సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం కొంతకాలంగా వేచి చూస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సెకండ్ డోస్ టీకాలు అందుబాటులోకి రావడంతో దవాఖాన ప్రా ంగణంలో ప్రజలు ఉదయం నుంచే క్యూలైన్లో నిల్చు న్నారు. సీహెచ్సీ కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ అమర్సింగ్, పీహెచ్సీ దవాఖానలో డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రజలకు వ్యాక్సిన్ వేశారు.
రామాయంపేట…
రామాయంపేట, మే 25: సెకండ్డోస్ వ్యాక్సినేషన్ ఆరోగ్య సిబ్బంది మొదలు పెట్టారు. వారం రోజులుగా నిలిపివేసిన టీకాలను మంగళవారం ఆరోగ్య సిబ్బంది వేశారు. మొదటి టీకాను వేసుకున్న నాలుగు వారాల నుంచి రెండో టీకాను ఎప్పుడైనా ఆన్లైన్లో నమోదు చేసుకుని వేసుకోవాలని వైద్య సిబ్బంది తెలిపారు.
వ్యాక్సినేషన్ వేసుకునే వారు ముందుగా సంబంధిత దవాఖానలోనే ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. మొదటి రోజు 45 మందికి రామాయంపేట సీహెచ్సీలో టీకాలు వేశారు.