వరంగల్ : రాష్ట్రంలో మేఘా గ్యాస్ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో తన సేవలు ఆరంభించిన మేఘా గ్యాస్.. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కూడా కార్యకలాపాలను ప్రారంభించింది. వరంగల్ జిల్లాలో తొలి సీఎన్జీ స్టేషన్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిటైల్ సేల్స్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం ధర్మారావు వరంగల్ -భూపాలపల్లి రహదారి డీజిల్ కాలనీలోని శ్రీ రామ ఫిల్లింగ్ స్టేషన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ.. వాహనాలకు సీ ఎన్జీ వాడకం వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు.
కాలుష్యం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిని తగ్గించటంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ మేనేజర్ విఆర్ఎల్ హరి ప్రసాద్, రిటైల్ సేల్స్ మేనేజర్ ఎంఎం కిషోర్, మేఘా గ్యాస్ రిటైల్ సేల్స్ మేనేజర్ దేవా చంద్ర శేఖర్, టెక్నికల్ మేనేజర్ రాజ్ కుమార్, సైట్ ఇంచార్జి ఎం. రాజేష్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు