దండేపల్లి, మార్చి 30 : మహిళా పీఆర్టీయూ (టీఎస్)ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేసిన వి ద్యార్థి సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాల యంలో సిబ్బందికి మంగళవారం వినతి ప త్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆ ర్సీ, వయో పరిమితి పెంపును పురస్కరిం చుకు ని ఏర్పాటు చేసిన సభలో ఉపాధ్యాయులు చేప ట్టిన కార్యక్రమాన్ని తప్పుగా చూపెట్టడం సరికా దన్నారు. పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు ఆర్ రవి, నాయకులు బాధ్యులు అప్పాల మనో హర్, సంఘర్స్ రాజేశ్వర్రావు, రామన్న, వరల క్ష్మి, శ్రీనివాస్, వెంకటమల్లు, రాజేశ్వర్, నరేం దర్, స్వామి, వేణుగోపాల్ పాల్గొన్నారు.
చెన్నూర్, మార్చి 30 : పీఆర్టీయూ (టీఎస్) ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉనిరసన తెలిపారు. ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరిం చి పాఠశాలల్లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కుమారస్వా మి మాట్లాడుతూ టీచర్లపై పని కట్టుకొని చేస్తు న్న దుష్ప్రచారాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభు త్వం 30శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా పీఆర్టీయూ (టీఎస్) ఆధ్వర్యంలో ధన్యవాద సభ నిర్వహించారని పేర్కొన్నారు. సభలో సంబురాలు జరుపుకున్నారని తెలిపా రు. ఎంఈవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందులో తోకల శ్రీధర్, మేకల రామస్వామి, శ్రీనివాస్, సుష్మ, వీణ పాల్గొన్నారు.
కాసిపేట, మార్చి 30 : పాఠశాలల్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యా డ్జీలతో నిరసన తెలియజేశారని మండల అధ్యక్షుడు అన్నం రమణారెడ్డి తెలిపారు. మహిళా ఉపాధ్యాయులపై కొన్ని నకిలీ విద్యార్థి సం ఘా లు చేస్తున్న ఆరోపణలు పరిగణనలోకి తీసుకోవద్దని అధికారులను కోరారు. ఎంఈవోకు వినతిపత్రం అందించినట్లు వివరించారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు అన్నం రమణారెడ్డి, ప్రధా న కార్యదర్శి నాగేశ్వర్రావు, గోపాల్, కార్యదర్శి వేణుగోపాల్, డాన్యల్ పాల్గొన్నారు.