హైదరాబాద్: మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్లోని యూసుఫ్గూడలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో కోట్ల విజయ బాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో యువత రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేతుల మీదుగా గచ్చిబౌలి టిమ్స్కు అంబులెన్స్ను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అందజేశారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ముక్కోటి కోటి వృక్ష అర్చన లో భాగంగా జగిత్యాల పట్టణంలోని బీసీ కాలనీలో జిల్లా కలెక్టర్ రవి గుగులోత్, జడ్పీ అధ్యక్షరాలు దావా వసంత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. కరీంనగర్లోని 25వ డివిజన్లో మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.