ట్విట్టర్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్రకటన
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 28 (నమస్తే తెలంగాణ): దేశంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అయినట్టు తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నది. ఈనెల 11న కేంద్రం పౌరవిమానయాన శాఖమంత్రి వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్తో కలిసి ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకాశమార్గంలో డ్రోన్ల ద్వారా మెడిసిన్లను డెలివరీ చేసే ప్రక్రియను మూడు కంపెనీలతో పరీక్షించారు. అన్నీ నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టు విజయవంతమైందని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ప్రకటించింది.